సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో

మొదట ఈ కథను ప్రతీక్ బబ్బర్కి వినిపించారు. ఆయనే హీరోగా నటిస్తారని ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల ఆయన నటించిన 'ఏక్ దీవానా థా' విడుదలై నిరాశ మిగిల్చింది. దీంతో దర్శకుడు ఇమ్రాన్ ఖాన్ని సంప్రదించి కథ వినిపించినట్లు తెలిసింది. ఆయన కూడా పచ్చజెండా ఊపారట. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో నివసించే యువకుడి కథ ఇది. బాలీవుడ్లో వచ్చే విజయవంతమైన సినిమాల్ని పైరసీ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అతని చుట్టూనే సినిమా తిరుగుతుంది. 'పాన్ సింగ్ తోమార్' విడుదలవగానే 'మిలన్ టాకీస్'ను మొదలుపెడతారని సమాచారం. మొత్తానికి పైరసీ కూడా సనీ వస్తువు అయ్యిందన్నమాట.