'అత్తో అత్తమ్మ కూతురా'రీమిక్స్

నరేష్ హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్న చిత్రం ప్రారంభ వేడుక ఆర్ఎఫ్సీలో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి అడ్డాల పృథ్వీరాజ్ కెమెరా స్విచాన్ చేయగా, రామానాయుడు క్లాప్ ఇచ్చారు. దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యముని గృహానికి సంబంధించిన సెట్లో హీరో,హీరోయిన్స్ పై తొలి సన్నివేశాన్ని చిత్రించారు.ఈ చిత్రం సోషియో ఫాంటసీ. యముడు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం కథ నడుస్తుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగాఅల్లరి'నరేష్ మాట్లాడుతూ...యమ లోకం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి... మా చిత్రానికీ నేపథ్యం ఆ లోకమే. అయితే యముడితో ఓ యువకుడు ఆడిన ఆట ఏమిటనేది మా చిత్రంలో చూడాలి. అలాగే సత్తిబాబు దర్శకత్వంలో అంతకుముందు బెట్టింగ్ బంగార్రాజు' చేశాను. ఆ తర్వాత చాలా కథలు చెప్పాడు. చివరకు ఈ సోషియో ఫాంటసీ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. యమలోకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. అల్లుడా మజాకా'లోని అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నాం. గంటన్నర సేపు గ్రాఫిక్స్ ఉంటాయి. రమ్యకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అయితే... మనుషుల మధ్య ఇన్ని అంతరాలు ఎందుకున్నాయనే ఇతివృత్తంతో సాగే కథ ఇది. దీన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం. యముడిగా సాయాజీ షిండే నటిస్తున్నారు. నరేష్ నవ్వించడమే కాదు యముడి చేత కన్నీళ్లు పెట్టిస్తాడు. యముడి భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నారు''అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ -అయిదేళ్ల విరామం తర్వాత ఈ సినిమా చేస్తున్నాం. 9 నెలలు శ్రమించి ఈ కథ తయారు చేశాం. దాదాపు 12 సెట్లు వేస్తున్నాం. రిచా పనయ్ను నాయికగా పరిచయం చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్సిటీలో పన్నెండు సెట్లు వేస్తున్నాం. రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. మే 15 వరకూ తొలి షెడ్యూల్ జరుగుతుంది''అన్నారు
నరేష్, గిరిబాబు, కృష్ణభగవాన్, రఘుబాబు, ధర్మవరపు, భరత్, సుధ తదితరులు ఇతర పాత్రధారులు. మూల కథ: జయ సిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, కళ: కిరణ్కుమార్.యమ్, కూర్పు: గౌతంరాజు, కెమెరా: కె.రవీంద్రబాబు, సంగీతం: కో